మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారత్లో నేరుగా మొబైల్ రీఛార్జ్ చేసుకునే సరికొత్త ఫీచర్ను లాంచ్ చేసింది. ఇందుకోసం ‘పే యూ’ (PayU)తో జతకట్టిన వాట్సాప్, జియో, ఎయిర్టెల్, వీఐ వినియోగదారులకు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. హోమ్ స్క్రీన్పై ఉన్న రూపాయి (₹) ఐకాన్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన ప్లాన్ను ఎంచుకుని యూపీఐ, కార్డుల ద్వారా పేమెంట్ చేయవచ్చు. రీఛార్జ్తో పాటు కరెంట్ బిల్లులు, మెట్రో టికెట్ల బుకింగ్ వంటి సౌకర్యాలను కూడా ఒకే చోట కల్పించింది. దీనివల్ల థర్డ్ పార్టీ యాప్ల అవసరం లేకుండా చాట్ బాక్స్ నుంచే పనులు పూర్తి చేసుకోవచ్చు.
![]()




