తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏప్రిల్ 25 నుంచి 27 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో మలయప్పస్వామి వారు వరుసగా గజ, అశ్వ, గరుడ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉభయ నాంచారులతో కలిసి నిర్వహించే ఈ కల్యాణ మహోత్సవం దృష్ట్యా, ఆ మూడు రోజులు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది. భక్తులు ఈ విశిష్ట ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోవచ్చు.
![]()




