తెలంగాణ సచివాలయంలో మహిళా ఉద్యోగుల రక్షణ కోసం ప్రభుత్వం అంతర్గత ఫిర్యాదుల కమిటీని (ICC) ఏర్పాటు చేసింది. లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POSH) అమలులో భాగంగా జీఏడీ జాయింట్ సెక్రటరీ సుధారాణి అధ్యక్షతన ఈ కమిటీని నియమిస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పని ప్రదేశాల్లో వేధింపులపై వచ్చే ఫిర్యాదులను ఈ కమిటీ విచారించి బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేస్తుంది. మహిళా ఉద్యోగుల భద్రతకు ఈ నిర్ణయం ఎంతగానో తోడ్పడనుంది.
![]()




