శబరిమల ఆలయంలో 10-50 ఏళ్ల మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్థించింది. మత విశ్వాసాలు, స్వయంప్రతిపత్తి కలిగిన ఇలాంటి అంశాలు న్యాయ సమీక్షకు అతీతమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. రుతుక్రమ అంశాన్ని అంటరానితనంగా చూడవద్దని, ఇది కేవలం వయసు పరిమితికి సంబంధించిన సంప్రదాయమని కేంద్రం వాదించింది. మత గ్రంథాల లోతైన అవగాహనతోనే ఇలాంటి ఆచారాలను చూడాలని, వీటిని పితృస్వామ్య కోణంలో విశ్లేషించవద్దని కోరింది.
![]()




