తమిళనాడు సాతాన్కుళం తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2020 లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారనే సాకుతో మొబైల్ షాపు యజమాని జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కస్టడీలో వారిని తీవ్రంగా హింసించి ప్రాణాలు తీశారు. ఈ అమానుష ఘటనకు పాల్పడిన తొమ్మిది మంది పోలీసులకు న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. బాధితులకు న్యాయం చేస్తూ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
![]()




