పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్థిక వృద్ధి అంచనాలను మూడీస్ రేటింగ్స్ 6.8 శాతం నుండి 6 శాతానికి తగ్గించింది. ఇంధన ధరల పెరుగుదల, ఎల్పీజీ సరఫరాలో అంతరాయాలు మరియు ఎరువుల దిగుమతి ఖర్చులు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నప్పటికీ, భౌగోళిక రాజకీయ పరిణామాల వల్ల 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇది 4.8 శాతానికి చేరుకోవచ్చని మూడీస్ విశ్లేషించింది. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉందని పేర్కొంది.
![]()




