స్పష్టతపశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. భారత్లో రెండు నెలలకు సరిపడా చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, సరఫరాలో అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. నిల్వలు పుష్కలంగా ఉన్నందున వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
![]()




