మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపురం గ్రామస్థులు రహదారి భద్రతపై వినూత్న నిర్ణయం తీసుకున్నారు. వారం క్రితం పోలీసులు నిర్వహించిన అవగాహన సదస్సుతో స్ఫూర్తి పొంది, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తేనే గ్రామంలోకి రావాలని పంచాయతీ తీర్మానించింది. ఈ మేరకు గ్రామ శివారులో హెచ్చరిక బ్యానర్ ఏర్పాటు చేశారు. ప్రాణ రక్షణ కోసం గ్రామస్థులే స్వచ్ఛందంగా తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించే వారికి అనుమతి లేదని స్పష్టం చేశారు.
![]()



