కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో మందుగుండు సామాగ్రిని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎస్సై, వాహన డ్రైవర్ దుర్గాంజనేయులుతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి స్టేషన్లోని ఫర్నిచర్ మరియు బయట ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సీఐ కేఎస్ రావు ఘటనాస్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం స్థానికంగా కలకలం సృష్టించింది.
![]()




