మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్పార్కు వద్ద నిరసన చేపట్టారు. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వాటా ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. వేల కోట్ల అవినీతి జరగకపోతే సభను ఎందుకు వాయిదా వేశారని ధ్వజమెత్తారు. మెట్రో భూములను కొట్టేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ, కేటీఆర్, హరీశ్ రావు నేతృత్వంలో నేతలు అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. ప్రభుత్వం వెంటనే మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
![]()




