పట్నా-టాటానగర్ వందేభారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికుడికి వడ్డించిన పెరుగులో పురుగులు రావడంతో రైల్వే శాఖ తీవ్రంగా స్పందించింది. ఆహార నాణ్యతలో నిర్లక్ష్యం వహించినందుకు ఐఆర్సీటీసీకి రూ.10 లక్షల జరిమానా విధించింది. సదరు ఆహార సరఫరాదారునికి రూ.50 లక్షల జరిమానా వేయడంతో పాటు కాంట్రాక్టును తక్షణమే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణికుల ఆరోగ్యం, భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
![]()



