దేశవ్యాప్తంగా పేరుకుపోతున్న కేసుల పరిష్కారానికి న్యాయ సంస్కరణల కమిషన్ (JRC) ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న సూచించారు. శనివారం జరిగిన జాతీయ సదస్సులో ఆమె మాట్లాడుతూ.. అనవసర వాయిదాలు, ప్రభుత్వ అప్పీళ్లు, పోస్టుల భర్తీలో జాప్యం వల్ల న్యాయం అందడంలో ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. ఈ కమిషన్లో అన్ని స్థాయిల న్యాయమూర్తులు, న్యాయవాదులకు భాగస్వామ్యం ఉండాలని, వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడం ద్వారానే కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.
జస్టిస్ నాగరత్న సూచించిన ప్రధాన అంశాలు:వాయిదాల సంస్కృతి: లాయర్లు, కక్షిదారులు తమ ప్రయోజనాల కోసం కేసులను సాగదీయడం ఆపాలి.ప్రభుత్వ వ్యాజ్యాలు: ప్రభుత్వం అనవసర అప్పీళ్లకు వెళ్లకుండా సమగ్ర ‘లిటిగేషన్ పాలసీ’ తీసుకురావాలి.నిధులు & నియామకాలు: న్యాయమూర్తుల ఖాళీలను వెంటనే భర్తీ చేస్తూ, తగినన్ని నిధులు కేటాయించాలి.
![]()




