విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో 12 ఏళ్లకోసారి నిర్వహించే మహాకుంభాభిషేక మహోత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ముగిశాయి. లోక కల్యాణం కోసం చేపట్టిన ఈ పవిత్ర క్రతువులో భాగంగా యాగశాల పూజలు, పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 9.34 గంటలకు కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆలయ శిఖర గోపురానికి కుంభాభిషేకం చేశారు. ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
![]()

Leave a Reply