📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,038,987  |  397 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు
Telangana ⚡ AMP

దళితుల రాజ్యాంగ హక్కుల సాధనకై “ఛలో ఢిల్లీ” : పిల్లి సుధాకర్‌

November 5, 2025 November 5, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

హబూబాబాద్‌ జిల్లాలోని గాంధీపురం మున్సిపల్‌ పరిధిలో జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో జరగనున్న “ఛలో ఢిల్లీ” కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవంబర్‌ 26న ఢిల్లీలో దళితుల ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కుల సాధన కోసం విస్తృత స్థాయిలో ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా దళితుల హక్కులు, సమాన అవకాశాలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని రక్షించడం ప్రతి పౌరుడి బాధ్యతగా పేర్కొంటూ, దళితుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సందర్భంలో మాలమహానాడు తరఫున పలు కీలక డిమాండ్లు ఉంచబడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి — పార్లమెంట్‌కు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరును ఇవ్వడం, మాల, మహార్‌ అనుబంధ కులాల అభివృద్ధికి ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై పునర్మూల్యాంకనం, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల చట్టం ప్రవేశపెట్టి, రిజర్వేషన్ల శాతాన్ని 15 నుండి 20 శాతానికి పెంచడం ఉన్నాయి. అదేవిధంగా, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం, న్యాయస్థానాలు, రాజ్యసభల్లో రిజర్వేషన్లు అమలు చేయడం, విద్యార్థులకు భారత రాజ్యాంగాన్ని ప్రాంతీయ భాషల్లో అందించడం, కరెన్సీ నోట్లపై అంబేద్కర్‌ చిత్రాన్ని ముద్రించడం వంటి అంశాలు ఉన్నాయి.

లాగే బ్యాగరి, కాటికాపరులకు జాతీయ గుర్తింపు, గౌరవ వేతనం, ఎస్సీ–ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ సహకారం, పాఠశాలల్లో రాజ్యాంగ పీఠికను ప్రతిరోజు ప్రార్థనలో చదివేలా చేయాలని కూడా డిమాండ్‌ చేశారు. పిల్లి సుధాకర్‌ మాట్లాడుతూ, ఈ పోరాటం దళితుల హక్కులకే కాకుండా రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించినదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గండమల్ల జాని, పచ్చర్ల బన్ను, గాజుల చిన్ని, గోగు మహేష్‌, ఇర్రి నాగరాజు తదితర నేతలు పాల్గొన్నారు. చివరగా “జై మాల, జై భీమ్” నినాదాలతో సభ ముగిసింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!