📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 484,169  |  402 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుపాటియాలాలో భారీ పేలుడు: రైల్వే ట్రాక్ సమీపంలో వ్యక్తి మృతిశ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ఏయూ నుంచి రాణించిన మేధావులు గర్వకారణం: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్Latest Breaking News from PressMeetతాజా వార్తలుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుపాటియాలాలో భారీ పేలుడు: రైల్వే ట్రాక్ సమీపంలో వ్యక్తి మృతిశ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ఏయూ నుంచి రాణించిన మేధావులు గర్వకారణం: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
National ⚡ AMP

జస్టిస్‌ వర్మపై పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు – అభిశంసన తీర్మానంపై దృష్టి

July 21, 2025 July 21, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

డిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై నోట్ల కట్టలు ఇంట్లో దొరికిన కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకంగా స్పందించింది. ఆయనపై కేసు నమోదు చేయాలని కోరుతూ అత్యవసర పిటిషన్‌ దాఖలై ఉండగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్ గవాయ్, జస్టిస్‌ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. న్యాయస్థానంలో వాదనలు వినిపించిన న్యాయవాది, జస్టిస్‌ వర్మను “వర్మ” అని సంబోధించడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. న్యాయమూర్తిని సరైన గౌరవంతో పలకరించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ – “ఆయన మీ స్నేహితుడా?” అంటూ ప్రశ్నించింది.

పిటిషనర్‌ తరఫు లాయర్ వాదనలపై స్పందించిన ధర్మాసనం – “న్యాయవ్యవస్థ ఎలా పనిచేయాలో మీరు మాకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు” అంటూ తీవ్రంగా స్పందించింది. ఇదే సమయంలో, జస్టిస్‌ వర్మపై ఇప్పటికే పార్లమెంటు అభిశంసన తీర్మాన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయస్థానం తక్షణ విచారణ అవసరం లేదని తేల్చింది.

ఇకపోతే, నోట్ల కట్టలు కాలిపోతుండగా జస్టిస్‌ వర్మ ఇంటి ఆవరణలో కనిపించడం, సిబ్బంది వాటిని గుర్తించడం, ఈ వ్యవహారంపై అప్పటి సీజేఐ సంజీవ్‌ ఖన్నా ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో విచారణ కమిటీ వేయడం… ఇవన్నీ తీవ్ర సంచలనంగా మారాయి. కమిటీ నివేదికలో నోట్ల కట్టల అంశం నిజమేనని నిర్ధారణ కావడంతో, సీజేఐ వర్మకు రాజీనామా సూచించారు. కానీ ఆయన తిరస్కరించడంతో అభిశంసన ప్రక్రియ ప్రారంభమైంది.

ఈ నేపథ్యంలో పార్లమెంటులో ఈ వర్షాకాల సమావేశాల్లోనే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఇప్పటికే 100 మందికిపైగా ఎంపీలు ఈ తీర్మానంపై సంతకాలు చేసినట్టు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు జస్టిస్‌ వర్మను తొలగించాల్సిన విషయంలో ఏకాభిప్రాయంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

ఈ ఘటన దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో నైతికతపై తీవ్ర చర్చను రేకెత్తిస్తోంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!