📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, July 27, 2026
Visitors: 1,534,300  |  740 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Andhra ⚡ AMP

తెలుగు రాష్ట్రాల్లో భగభగమంటున్న ఎండలు: వాతావరణ శాఖ హెచ్చరిక

March 18, 2025 March 18, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగమంటున్నాయి. మార్చిలోనే మే నెల వేడిమి కనిపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 11 గంటల తర్వాత ఎండ దాహం చేసేస్తోంది. ఇప్పటికే 42°C దాటిన ఉష్ణోగ్రతలు వడగాలులతో కలసి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అత్యవసర పనులు తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. మంగళవారం 128 మండలాల్లో వడగాలులు, 29 మండలాల్లో తీవ్ర వడగాలులు నమోదయ్యే అవకాశముందని APSDMA ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. నిన్న ఏపీలో పార్వతీపురంలో 42.8°C, విజయనగరంలో 42.6°C, అనకాపల్లిలో 42.1°C వంటి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణలోనూ తీవ్ర ఎండలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. 22 జిల్లాల్లో 40°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న ఆదిలాబాద్ 40.3°C, నిజామాబాద్ 40.1°C, భద్రాచలం 40°C, మహబూబ్‌నగర్ 40°C, హైదరాబాద్ 39.2°C నమోదయ్యాయి. వడగాలుల ప్రభావం అధికంగా ఉండడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం అత్యవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!