ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు స్పందన

ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 30 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. భక్తుల భద్రతను నిర్ధారించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం, ఈ అంశంపై ఇప్పటికే అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ ఉందని పేర్కొంది. దురదృష్టకరమైన ఈ ఘటనపై విచారణ కోరిన న్యాయవాది విశాల్ తివారీని అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది.

సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ యూపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించగా, మౌని అమావాస్య సందర్భంగా జనవరి 30న జరిగిన ఈ ఘటనపై పిటిషనర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద మార్గదర్శకాలు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ కేసును హైకోర్టులోనే విచారించాల్సిందిగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!