📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,538,103  |  340 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Telangana ⚡ AMP

వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల అసెంబ్లీ ముట్టడి విజయవంతం మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య

December 19, 2024 December 19, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలపరచి గెలుపునకు కృషి చేసిన మాలలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఈ ధోరణిని విడనాడాలని చెన్నయ్య కోరారు. బి జె పి ని బలపరచి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన వర్గాన్ని విమర్శించే నాయకులను అక్కున చేర్చుకుని మాలలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెన్నయ్య విమర్శించారు. కులగణన లేకుండా ఎంపరికల్ డేటా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసే వర్గీకరణను అడ్డుకుంటామని
కేంద్ర ప్రభుత్వం 341 ఆర్టికల్ సవరణ ద్వారా దేశ మొత్తం అందరికీ సమ న్యాయం చేస్తే మాకు అభ్యంతరం లేదని కానీ ముఖ్యమంత్రి గతం లో చంద్రబాబు చేసిన విధంగానే చేయాలని చూస్తున్నారని దీని ద్వారా మాలల కు మాల అనుబంద కులాలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని మీ వైఖరి మార కుంటే మీకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాలలు ఉద్యమిస్తారని చెన్నయ్య హెచ్చరించారు. ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం లో మాల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు, చెరుకు రాంచందర్ , నల్లాల కనకరాజు,గోపోజు రమేష్, తాలూకా అనిల్ కుమార్ శ్రీమతి నక్క సృజన, శ్రీనివాస్, రమేష్, శ్రీకాంత్ లలిత , సరళ, రమ తదితరులు పాల్గొన్నారు

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!