ఆంధ్రలో గణేశ మండపాలకు చాలాన్స్ ఆ.. మండిపడ్డ మాధవీలత

ఏపీలో గణేష్ మండపాలకు చలాన్ల విషయం తీవ్ర విమర్శల లోనైంది. హోం మంత్రి వంగలపూడి అనిత గణేష్ మండపాలకు రోజుకు రూ.100, విగ్రహం సైజు ఆధారంగా రూ.350-750 చలాన్లను ప్రకటించారు. ఈ ప్రకటనపై విస్తృత విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నాయకురాలు మాధవీలత మంత్రి అనితపై తీవ్రంగా స్పందించారు, “గణేశుడికి ఆకలి ఎక్కువ, పండగల సమయంలో అసలే గణేశుడికి ఆకలి ఎక్కువ… ఆయన కోసం వండే వాటిని తగ్గించి మీకు నాలుగు ముఖాన వేస్తారు” అని ఎద్దేవా చేశారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసి, పండగలపై చిల్లర ఏరుకోవడాన్ని ప్రశ్నించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!