సూర్యాపేట జిల్లా గురుకుల హాస్టల్‌లో బీర్లు తాగుతున్న మహిళ ప్రిన్సిపాల్‌

గురుకుల హాస్టల్‌లో బీర్లు తాగుతున్న మహిళ ప్రిన్సిపాల్‌ను విద్యార్థినులు అడ్డంగా పట్టుకున్నారు. హాస్టల్‌లో కేర్ టేకర్‌తో కలిసి బీర్లు తాగుతూ ప్రిన్సిపాల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుందని విద్యార్థినులు ఆరోపించారు. సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో‌ రాత్రిళ్లు గదుల్లో ప్రిన్స్ పాల్ శైలజ, కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని డిగ్రీ విద్యార్థినులు తెలిపారు. అలాగే మద్యం కూడా సేవిస్తున్నారని, వారిని అడిగితే విద్యార్థినులు అని చూడకుండా తమను కొడుతుందని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కాగా, విద్యార్థినుల నిరసనతో సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది. ఉన్నతాధికారులు వెంటనే ప్రిన్సిపాల్, కేర్ టేకర్‌ను విధుల నుంచి తొలగించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. మరి దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!