దేశ రాజధాని దిల్లీలో స్వైన్ఫ్లూ (H1N1) కేసులు 2,308కు చేరాయి. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 3,000 ఇన్ఫ్లుయెంజా కేసులు నమోదైనట్లు వైద్యశాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ఆసుపత్రుల్లో తగినంత మంది వైద్యులు, మందులు, ఐసొలేషన్ వార్డులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా అత్యవసర సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కొత్తరకం స్వైన్ఫ్లూ వైరస్ గుర్తించలేదని ఐసీఎంఆర్ స్పష్టం చేయడంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
![]()




