యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో దానయ్య (38) హత్యకు గురయ్యాడు. భార్య శారద, వరుసకు కుమారుడైన రాపోలు శివతో కలిసి హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పొలం వద్ద శివ రాళ్లతో దానయ్యపై దాడి చేయగా, శారద అతడి కాళ్లు పట్టుకున్నట్లు వెల్లడించారు. అనంతరం ఇద్దరూ పరారయ్యారు. పోలీసుల దర్యాప్తులో నిందితుల పాత్ర వెలుగులోకి రావడంతో శారద, శివను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
![]()




