డిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుదేశంలో పెరుగుతున్న ‘డిజిటల్ అరెస్ట్’ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పలు ప్రతిపాదనలు సమర్పించింది. బయోమెట్రిక్ సిమ్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయడం, అనుమానాస్పద బ్యాంకు ఖాతాల నుంచి నగదు విత్డ్రా కాకుండా నిలిపివేయడం వంటి చర్యలను ఇందులో పేర్కొంది. వాట్సప్ వంటి యాప్లలో సిమ్ బైండింగ్ మెకానిజంను కఠినతరం చేయాలని, మోసపూరిత కాల్స్ను గుర్తించే అధునాతన ఫీచర్లను తీసుకురావాలని సూచించింది. సైబర్ నేరాలకు పాల్పడే డిజిటల్ పరికరాలను బ్లాక్ చేయాలని టెలికాం, బ్యాంకింగ్ రంగాలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
![]()




