రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ వ్యవహారంపై సభా సంఘం వేయాలని డిమాండ్ చేస్తూ గన్పార్క్ వద్ద కేటీఆర్, హరీశ్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. ఇతర సంస్థలపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం, రాఘవ కన్స్ట్రక్షన్స్పై ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. మంత్రుల అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఆధారాలున్నా చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటని కేటీఆర్ నిలదీశారు. తప్పు చేయకపోతే విచారణకు భయమెందుకని ప్రశ్నిస్తూ అసెంబ్లీకి ప్లకార్డులతో ర్యాలీగా వెళ్లారు.
![]()




