Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్
Advertisement 728×90
Telangana

ఫీజు బకాయిలపై ఆందోళన – యాజమాన్యాలతో అధికారుల చర్చలు

తెలంగాణలో వృత్తి విద్యా సంస్థలు (ప్రైవేట్ పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ తదితర కాలేజీలు) నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపును డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కి దిగిన నేపథ్యంలో, విద్యా వ్యవస్థలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాలేజీ యాజమాన్యాల నిరసనలు ఊపందుకోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా స్పందించింది. చదువు కొనసాగుతున్న విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఆదివారం రాత్రి మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు కాలేజీ యాజమాన్య ప్రతినిధులతో ప్రాథమిక చర్చలు […]

Loading

తెలంగాణలో వృత్తి విద్యా సంస్థలు (ప్రైవేట్ పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ తదితర కాలేజీలు) నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపును డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కి దిగిన నేపథ్యంలో, విద్యా వ్యవస్థలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాలేజీ యాజమాన్యాల నిరసనలు ఊపందుకోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా స్పందించింది.

చదువు కొనసాగుతున్న విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఆదివారం రాత్రి మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు కాలేజీ యాజమాన్య ప్రతినిధులతో ప్రాథమిక చర్చలు జరిపారు. ఆ చర్చల్లో ప్రభుత్వం సమస్యను పాజిటివ్‌గా తీసుకుంటున్నట్టు సంకేతాలు ఇచ్చినప్పటికీ, స్పష్టమైన నిర్ణయాలపై మౌనమే నిలిచింది. దీంతో ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులిద్దరూ సమావేశమై ఈ సమస్యపై సమాలోచనలు నిర్వహించారు.

విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా ఈ పరిణామాలను పరిశీలిస్తూ, విద్యా సంస్థల ప్రతినిధులతో మరింత లోతుగా చర్చలు జరుపుతున్నారు. కాలేజీ యాజమాన్యాలకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, విద్యార్థులకు అందుతున్న నష్టాన్ని సమతుల్యంగా పరిశీలించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం బకాయిలను పూర్తిగా ఎలా, ఎప్పుడు చెల్లించబోతుందన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో నాలుగు సంవత్సరాలుగా ఏర్పడిన పెండింగ్ కారణంగా అనేక విద్యాసంస్థలు ఆర్థికంగా కుదేలయ్యాయని యాజమాన్యాలు వాపోతున్నాయి. విద్యార్థులకు సౌకర్యాల అందించడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు. మౌలిక సదుపాయాల నిర్వహణ, ఉద్యోగులకు జీతాలు, ల్యాబ్‌లు, హోస్ట్‌ల్‌, ఇతర నిర్వహణ ఖర్చులన్నీ తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

ప్రభుత్వంతో జరుగుతున్న చర్చల ఫలితాన్ని బట్టి తమ తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని కళాశాల యాజమాన్యాలు ప్రకటించాయి. మరోవైపు, విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది రాష్ట్ర విద్యావ్యవస్థ భవితవ్యాన్ని నిర్దేశించనుంది.

Loading

Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play
▼ Get App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!