📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 486,916  |  537 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలు
Andhra ⚡ AMP

విశాఖలో వర్షాలు,వాయుగుండం ప్రభావం అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు

September 8, 2024 September 8, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

విశాఖలో వర్షాలు, వరదల దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు యంత్రాంగానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. GVMC, పోలీస్‌, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. GVMC కమిషనర్ నివేదిక ప్రకారం, 80 పునరావాస కేంద్రాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. వర్ష ప్రభావం గురయ్యే 14,630 కుటుంబాలను గుర్తించామనీ, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. వాతావరణశాఖ ప్రకారం, వాయుగుండం కళింగపట్నానికి తూర్పు-దక్షిణ దిశలో 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పూరికి దక్షిణ ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల సమీపానికి చేరిన ఈ వాయుగుండం రేపు ఉదయానికి తీవ్రవాయుగుండంగా మారవచ్చని తెలిపారు. వేగంగా పయనిస్తున్నందున రేపు మధ్యాహ్నానికి పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!