ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి-పుణె, అయోధ్య-ముంబై మార్గాల్లో రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. మంగళవారం కాశీలో జరిగిన కార్యక్రమంలో రూ.6,350 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల మధ్య అనుసంధానం పెరగడం వల్ల భక్తులకు కాశీ, అయోధ్య దర్శనం సులభతరమవుతుందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో విపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని విమర్శిస్తూనే, నారీ శక్తి వికాసం కోసం తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు.
![]()




