వయోజనులు పరస్పర అంగీకారంతో సహజీవనం చేసి విడిపోవడాన్ని అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండి, బిడ్డను కన్న తర్వాత విడిపోయినప్పుడు అత్యాచారం, దోపిడీ అని ఆరోపించడం సరికాదని జస్టిస్ బీవీ నాగరత్న పేర్కొన్నారు. అంగీకారంతో కూడిన సంబంధం విచ్ఛిన్నమైనంత మాత్రాన అది క్రిమినల్ నేరం కిందకు రాదని కోర్టు తేల్చి చెప్పింది. వివాహేతర బంధాల్లో వయోజనులు స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందులోని రిస్క్లను కూడా గుర్తించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై మహిళ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది.
![]()




