వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం చిలుకలు కూడా వన్యప్రాణులేనని, వాటి వల్ల పంట నష్టం జరిగితే ప్రభుత్వం పరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్రకు చెందిన ఓ రైతు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన నాగ్పుర్ ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. కేవలం ఏనుగులు, అడవి పందుల వంటి జంతువులకే పరిహారం పరిమితం చేయడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. బాధిత రైతుకు ఒక్కో దానిమ్మ చెట్టుకు ₹200 చొప్పున పరిహారం అందించాలని ఆదేశించింది. వన్యప్రాణులను కాపాడాలంటే రైతులకు భరోసా కల్పించడం అవసరమని న్యాయస్థానం అభిప్రాయపడింది.
![]()




