ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెండైన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీబీ అధికారులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి ఆమెను కస్టడీకి తీసుకున్న అధికారులు, ముందుగా జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. గత విచారణలో ఆమె సరైన సమాధానాలు చెప్పకపోవడంతో, కోర్టు అనుమతితో మరోసారి ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఏసీబీ బృందం ఆమె నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తోంది. విచారణ అనంతరం ఆమెను తిరిగి రిమాండ్కు తరలించనున్నారు.
![]()




