గోవాకు చెందిన సాధ్వీ సతీశ్ సైల్ 61వ ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్-2026 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. భువనేశ్వర్లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో మహారాష్ట్రకు చెందిన రాజ్నందిని పవార్ తొలి రన్నరప్గా, జమ్మూ కశ్మీర్కు చెందిన అద్వైత రెండో రన్నరప్గా నిలిచారు. కెనడాలో ఉన్నత విద్యనభ్యసించిన సాధ్వీ, వ్యాపారవేత్తగా రాణిస్తూనే సామాజిక సేవలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ విజయంతో ఆమె 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారు.
![]()




