రద్దయిన పాత కరెన్సీ నోట్ల మార్పిడికి ఆర్బీఐ అనుమతించిందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కేంద్రం తేల్చి చెప్పింది. దీనిపై ఆర్బీఐ ఎలాంటి కొత్త మార్గదర్శకాలు విడుదల చేయలేదని పీఐబీ ఫ్యాక్ట్చెక్ విభాగం స్పష్టం చేసింది. ప్రజలు ఇటువంటి నకిలీ వార్తలను నమ్మవద్దని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే పీఐబీ వాట్సప్ నంబర్ +91 8799711259 కు పంపాలని సూచించింది. అధికారిక సమాచారం కోసం ఆర్బీఐ వెబ్సైట్ను మాత్రమే చూడాలని వెల్లడించింది.
![]()




