డీలిమిటేషన్పై కేంద్రం స్పష్టతనిస్తూ ప్రస్తుత లోక్సభ స్థానాలను 50 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఈ ప్రక్రియ ఉంటుందన్న అపోహలను కొట్టిపారేసింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై చర్చ జరగనుంది. 2029 ఎన్నికల ముందే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలన్న కేంద్ర నిర్ణయంపై విపక్షాలు రాజకీయ కుతంత్రమని మండిపడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు తమకు అన్యాయం జరుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో ఈ సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశం ఉంది.
![]()




