మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇండియా కూటమి అనుకూలమేనని, అయితే డీలిమిటేషన్తో ముడిపెట్టడం కేంద్రం చేస్తున్న రాజకీయ కుతంత్రమని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మండిపడ్డారు. జనగణన పూర్తికాకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. 2029 నుండి రిజర్వేషన్లు అమలు చేసేందుకు లోక్సభ స్థానాలను 850కి పెంచాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో ఐక్యంగా పోరాడుతామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను అణచివేసేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఖర్గే ఆరోపించారు.
![]()




