ఛత్తీస్గఢ్ శక్తి జిల్లాలోని వేదాంత పవర్ ప్లాంట్లో మంగళవారం బాయిలర్ పేలి ఘోర ప్రమాదం సంభవించింది. ఈ విస్ఫోటనంలో 10 మంది కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించింది. భద్రతా వైఫల్యాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![]()




