తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆకర్షణీయమైన మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళలకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఈ-స్కూటర్ల కొనుగోలుకు రూ.25,000 సబ్సిడీ వంటి హామీలు ఇచ్చారు. జల్లికట్టు ఎద్దుల పెంపకందారులకు నెలకు రూ.2,000, రైతులకు అదనపు పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించారు. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, ఈ వరాల జల్లు ఓటర్లను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
![]()




