📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, July 27, 2026
Visitors: 1,534,707  |  750 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Crime ⚡ AMP

అల్లూరి జిల్లాలో ఘోర విషాదం: ఘాట్‌రోడ్డులో లోయలో పడ్డ బస్సు

December 12, 2025 December 12, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ప్రెస్ మీట్ రిపోర్టర్ ప్రసాద్ : అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ప్రాంతంలో విషాదం నెలకొంది. చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ పర్యాటక బస్సు నియంత్రణ కోల్పోయి లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో మొదటి సమాచార ప్రకారం 15 మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాద స్థలానికి వెంటనే చింతూరు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అంబులెన్స్ బృందాలు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. రోడ్డు వంకరలు, పొగమంచు, డ్రైవర్‌కు అకస్మాత్తుగా స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోవడం వంటి అంశాలు ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ప్రమాదం జరిగిన ప్రదేశం లోతైన అడవి ప్రాంతం కావడంతో రక్షణ చర్యలు కష్టసాధ్యంగా మారాయి. పోలీసులు క్రేన్‌లు, వ్యాలీ రెస్క్యూ టీమ్స్ సహాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. మరణించిన వారిలో పర్యాటకులు, స్థానిక ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

మారేడుమిల్లి–చింతూరు ఘాట్ రోడ్డు ప్రాంతంలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో అక్కడి భద్రతా ఏర్పాట్లను పునర్విమర్శించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!