ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం భేటీ అయిన కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు తెలియజేశారు.

2025-26 ఖరీఫ్‌ సీజన్‌ (kharif season) కోసం 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (MSP) ఆమోదించింది. కనీస మద్దతు ధర కోసం రూ.2 లక్షల 70 వేల కోట్లు కేటాయించింది. క్వింటాల్‌ వరి మద్ధతు ధర రూ.69కి పెంచింది. తాజా పెంపుతో అది రూ.2,369కి చేరింది. ఇది సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్లు ఎక్కువ మద్దతు ధరగా నిర్ణయించింది. తాజా పెంపుతో

వరి సాధారణ గ్రేడ్ ఏ క్వింటాలు 69 రూ పెంపు 
జొన్నలు క్వింటా రూ. 328 పెంపు 
సజ్జలు క్వింటా రూ.150 పెంపు 
రాగులు క్వింటా రూ.596 పెంపు 
మొక్కజొన్న క్వింటా రూ.175 పెంపు 
కందిపప్పు క్వింటా రూ.450 పెంపు 
పెసర్లు క్వింటా రూ.86పెంపు 
మినుములు క్వింటా రూ.400 పెంపు 
వేరుశెనగ క్వింటా రూ.480 పెంపు 
పొద్దుతిరుగు క్వింటా రూ.441 పెంపు 
సోయాబీన్ క్వింటా రూ.436 పెంపు 
కుసుములు క్వింటా రూ.579 పెంపు
వలిసెలు క్వింటాల్‌కు రూ.820 పెంపు
ప్రత్తి క్వింటాల్‌కు రూ.589 పెంపు
నువ్వులు : క్వింటాల్‌కు రూ.579 పెంపు.

బద్వేల్‌-నెల్లూరు 4 లేన్ల రోడ్డుకు రూ.3,653 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. సుమారు 108 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి నిర్మాణం జరగనుంది. వార్దా బల్లార్షా 4 లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Loading

By admin

error: Content is protected !!