నలుపును ఎందుకు అవమానించాలి? అది విశ్వమంతా వ్యాపించి ఉన్న సత్యం : కేరళ చీఫ్‌ సెక్రటరీ శారదా మురళీధరన్‌

1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి శారదా మురళీధరన్‌ కొద్ది నెలల క్రితం కేరళ చీఫ్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రత్యేకత ఏమిటంటే, తన భర్త తర్వాత ఆమె ఈ హోదాలో చేరడం. అయితే, వారి రంగు గురించి జరిగిన కొన్ని కామెంట్లు ఆమె దృష్టికి వచ్చాయి, దాంతో తన అనుభవాలను బహిరంగంగా పంచుకున్నారు.

తనపై వచ్చిన వ్యాఖ్యలపై శారద స్పందిస్తూ, “నా రంగును నేను అంగీకరించాల్సి ఉంది. ఈ విషయంలో ఒక పోస్టు పెట్టాను. తర్వాత వచ్చిన ప్రతిస్పందనతో కంగారు పడి తొలగించాను. అయితే ఇది చర్చించాల్సిన అంశమే అని శ్రేయోభిలాషులు చెప్పడంతో మళ్లీ షేర్ చేశాను” అని తెలిపారు.

అంతేకాక, చిన్నతనంలో తన అనుభవాలను వెల్లడిస్తూ, “నలుపును ఎందుకు అవమానించాలి? అది విశ్వమంతా వ్యాపించి ఉన్న సత్యం. నాలుగేళ్ల వయసులో నేను నా తల్లిని ‘నన్ను తెల్లగా, అందంగా తిరిగి జన్మించగలవా?’ అని అడిగిన సందర్భం ఉంది. నా పిల్లలు ఈ వర్ణం అద్భుతమని, అందమైనదని నాకు గుర్తించగలిగారు” అని వివరించారు.

శారద మురళీధరన్ వ్యక్తిగతంగా తన అనుభవాలను పంచుకోవడం పలువురు అభినందిస్తున్నారు. కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ స్పందిస్తూ, ఆమె చెప్పిన ప్రతిమాట హృదయాన్ని తాకింది. ఇది సమాజంలో చర్చించాల్సిన విషయం” అని పేర్కొన్నారు.

శారద మురళీధరన్ గతంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ డైరెక్టర్ జనరల్, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ సీఓఓ, కుడుంబశ్రీ మిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ హోదాల్లో సేవలందించారు. కేరళ చరిత్రలో తొలిసారి భర్త నుంచి ఆమె చీఫ్‌ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించడం విశేషం.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!