Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్
Advertisement 728×90
Crime

మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో నేడు తుది తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ హత్య కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎనిమిది మంది పై న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. కేసు నేపథ్యం: అమృత వర్షిణి, ప్రణయ్‌లు ప్రేమవివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో వీరి వివాహాన్ని అమృత తండ్రి మారుతీరావు ఒప్పుకోలేదు. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో, మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో 2018 సెప్టెంబరు 14న ప్రణయ్‌ను హత్య […]

Loading

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ హత్య కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎనిమిది మంది పై న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది.

కేసు నేపథ్యం:

అమృత వర్షిణి, ప్రణయ్‌లు ప్రేమవివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో వీరి వివాహాన్ని అమృత తండ్రి మారుతీరావు ఒప్పుకోలేదు. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో, మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో 2018 సెప్టెంబరు 14న ప్రణయ్‌ను హత్య చేయించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

విచారణ:

కేసు నమోదు చేసిన పోలీసులు, మారుతీరావుతో సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం, 2019 జూన్ 12న 1600 పేజీలతో ఛార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే ప్రధాన నిందితుడు మారుతీరావు 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇరు పక్షాల వాదనలు, సాక్ష్యాలు, ఆధారాల సమర్పణ పూర్తి కావడంతో, న్యాయస్థానం మార్చి 10న తుది తీర్పు వెలువడనుంది.

ప్రస్తుత పరిస్థితి:

నల్లగొండ ఎస్సీ/ఎస్టీ రెండో అదనపు జిల్లా కోర్టు వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. తుది తీర్పు కోసం ప్రణయ్ కుటుంబ సభ్యులు, అమృత, మీడియా ప్రతినిధులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా పరువు హత్యలపై చర్చకు దారితీస్తుందని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు నివారించేందుకు మార్గదర్శకంగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Loading

Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play
▼ Get App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!