📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, July 27, 2026
Visitors: 1,534,304  |  740 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Andhra ⚡ AMP

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు హైస్పీడ్ రైల్వే గుడ్‌న్యూస్ – టెండర్ల ప్రక్రియ ప్రారంభం

February 3, 2025 February 3, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు మధ్య ఎలివేటెడ్ హైస్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణానికి మొదటి అడుగుగా టెండర్లు జారీ చేసింది. ఈ నెల 10 నుండి 24వ తేదీ వరకు టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. రూ. 33 కోట్ల వ్యయంతో లైడార్ సర్వే చేపట్టనుంది, ఇది 8 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

హైదరాబాద్- చెన్నై కారిడార్:
ఈ మార్గం సుమారు 620 కి.మీ. పొడవుగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కర్నూలు, రేణిగుంట, గుంటూరు, వాడి-రాయచూరు మీదుగా చెన్నై వెళ్లే మార్గాలు ఉన్నాయి. కొత్త ప్రతిపాదనలలో హైదరాబాద్-సూర్యాపేట-అమరావతి-తిరుపతి, అలాగే కాజీపేట-విజయవాడ మీదుగా మార్గాన్ని పరిశీలిస్తున్నారు.

హైదరాబాద్- బెంగళూరు కారిడార్:
570 కి.మీ. పొడవులో నిర్మించనున్న ఈ మార్గం మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూల్, అనంతపురం మీదుగా కొనసాగే అవకాశం ఉంది. గంటకు 350 కి.మీ. గరిష్ట వేగంతో, 320 కి.మీ. సగటు స్పీడ్‌తో రైళ్లు నడుస్తాయి. అంటే కేవలం 2 గంటల్లో బెంగళూరు, చెన్నై చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ అమలయితే రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతోపాటు ఆర్థిక ప్రగతికి సహాయపడనుంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!