కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన

కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖమ్మం పట్టణంలోని 16వ డివిజన్ దంసాలపురంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ముంపు బాధితులతో మాట్లాడి పునరావాస చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. వరద నివారణలో ప్రభుత్వం సహకారం లేదని స్థానికులు పేర్కొన్నారు. కిషన్ రెడ్డి మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మాణ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో ఎంపి ఈటెల రాజేందర్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!