పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ శనివారం పీఎం-ఆర్థిక సలహా మండలితో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. యుద్ధ ముగింపుపై అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలో దేశీయంగా దాని ప్రభావాన్ని తగ్గించే వ్యూహాలపై చర్చించారు. భారత ఆర్థికవృద్ధిని మరింత బలోపేతం చేయడం, అంతర్జాతీయ ఒడుదొడుకులను తట్టుకునేలా మార్కెట్లను సిద్ధం చేయడం మరియు వ్యాపార అనుకూల వాతావరణం కోసం సంస్కరణలను వేగవంతం చేయడం వంటి కీలక అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా దృష్టి సారించారు.
![]()



