స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తూ ప్రైవేట్ రంగ సంస్థ ‘నిబే లిమిటెడ్’ తన సుదూర గైడెడ్ రాకెట్ వ్యవస్థ ‘సూర్యాస్త్ర’ ప్రయోగాన్ని ఒడిశాలోని చాందీపుర్ వేదికగా విజయవంతంగా నిర్వహించింది. 150-300 కి.మీ దూరంలోని లక్ష్యాలను కేవలం 1.5 నుండి 2 మీటర్ల కచ్చితత్వంతో ఛేదించగల రెండు వేరియంట్లను ఇందులో పరీక్షించారు. అధునాతన నావిగేషన్ వ్యవస్థ కలిగిన ఈ డీప్ స్ట్రైక్ రాకెట్లను కొనుగోలు చేసేందుకు భారత సైన్యం ఆసక్తి చూపుతుండగా, ఈ విజయం ‘ఆత్మనిర్భర్ భారత్’ ఆశయాలకు మరింత బలాన్ని చేకూర్చింది.
![]()




