కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈనెల 14న వెకేషన్ బెంచ్ విచారణ జరపనుంది. 17 ఏళ్ల బాలికను వేధించారన్న ఫిర్యాదుతో పేట్ బషీరాబాద్ పోలీసులు ఈ నెల 8న కేసు నమోదు చేయగా, సదరు బాలిక కుటుంబం తనను డబ్బు కోసం బెదిరిస్తోందని భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు పక్షాల ఫిర్యాదులతో ఈ వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానం పరిధిలోకి చేరింది.
![]()



