ఏపీలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంధన కొరత అత్యవసర పరిస్థితిని తలపిస్తోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి 24 గంటల్లోగా సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని ఈ సంక్షోభం ఏపీలోనే ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించిన ఆమె, 70 శాతం బంకులు మూతపడటం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. ఎర్రటి ఎండలో ప్రజలు కిలోమీటర్ల మేర బారులు తీరడం దారుణమని, సమీక్షలతో కాలయాపన చేయకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
![]()




