మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రక్షక భటులే దొంగలుగా మారి ఒక వ్యాపారి ఇంట్లో 22 తులాల బంగారాన్ని లూటీ చేయడం కలకలం రేపింది. ఆస్తి వివాదంలో వారెంట్ ఇచ్చేందుకు వెళ్లిన ఎస్ఐ సంజయ్ విష్ణోయ్ బృందం, సీసీటీవీలు ఆపి మాస్టర్ కీతో ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. బాధితుడిని అక్రమంగా నిర్బంధించి, డిజిటల్ రూపంలో లంచం కూడా వసూలు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేయగా, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
![]()




