కేంద్ర ప్రభుత్వం పెసా చట్టానికి తూట్లు పొడుస్తూ ఆదివాసీల హక్కులను హరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. జనగణనలో ‘ఆదివాసీ’ మత కాలమ్ను చేర్చకపోవడం వారి సంస్కృతిని అవమానించడమేనని మండిపడ్డారు. ఆదివాసీల భాష ‘కోయతూర్’ను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కుల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ వారి గౌరవాన్ని కాపాడేలా ఉంటుందని ఈ సందర్భంగా కవిత స్పష్టం చేశారు.
![]()




