ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైతులకు మేలు చేసేలా ఖరీఫ్ సీజన్ ఎరువుల రాయితీకి ₹41,543 కోట్ల కేటాయింపులకు ఆమోదం తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా రైతులపై భారం పడకుండా కేంద్రమే భరించనుంది. అలాగే ₹13 వేల కోట్లతో జైపూర్ మెట్రో రెండో దశకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజస్థాన్ రిఫైనరీ జూలై 2026 నుండి అందుబాటులోకి రానుందని, దీనివల్ల దేశ ఇంధన సామర్థ్యం మరింత పెరుగుతుందని మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
![]()




