సాత్తాన్కుళం లాకప్ మరణాల కేసులో నిందితులతో పాటు నాటి పాలకులనూ శిక్షించాలని ఎంఎన్ఎం అధ్యక్షుడు కమల్ హాసన్ డిమాండ్ చేశారు. జయరాజ్, ఫెన్నిక్స్లపై జరిగిన అమానవీయ హింస దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసిందని, నిజాలను దాచిపెట్టిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. అధికార గర్వంతో అమాయకుల ప్రాణాలు తీసే వ్యవస్థను నిర్మూలించాలని, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన బాధితుల కుటుంబానికి, నేరాన్ని నిరూపించిన సీబీఐకి ఆయన అభినందనలు తెలిపారు.
![]()




